Rashmika: రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో ఈ మధ్యకాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. అంతేకాదు సౌత్ సినిమాలను, హీరోలను తక్కువ చేసి బాలీవుడ్ లో మాట్లాడడం వివాదాస్పదం అయింది.అలాగే తన సొంత భాష కన్నడ సరిగా మాట్లాడడం రాదని చెప్పి కూడా చిక్కుల్లో పడింది. అంతేకాకుండా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతారా (Kanthara) సినిమా చూడలేదని చెప్పడం కూడా పెద్ద వివాదానికి దారి తీసింది.
అలాగే తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ రిషబ్ శెట్టి,హీరో రక్షిత్ శెట్టి ల పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోవడం కూడా రష్మిక (Rashmika) చిక్కులో పడడానికి కారణం అయ్యింది. అయితే ఇన్ని వివాదాల్లో ఇరుక్కున్న రష్మికని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇప్పటికి కూడా ఆ వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఆమె వారీసు (Varisu) సినిమాకి కూడా కన్నడలో కలెక్షన్లు తగ్గాయని వార్తలు వస్తున్నాయి.
రష్మిక చేసిన పని కే ఆ సినిమా ఎవరు చూడడం లేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను స్పందించిన విధానంపై గతంలో ఓసారి మాట్లాడుతూ నేను అందరికీ నచ్చాల్సిన రూల్ లేదు కదా అని మాట్లాడింది. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక (Rashmika) కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. రష్మిక మాట్లాడుతూ.. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టిలే. వాళ్లు కిరిక్ పార్టీ సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీకి తీసుకువచ్చారు.
ప్రస్తుతం నేను నాలుగు భాషల్లో నటించగలుగుతున్నాను. దానికి కారణం వాళ్లే. ఈ మధ్యకాలంలో నాపై చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు.కానీ ఇప్పటినుండి వారిని నేను అస్సలు సహించను. సహనం పాటించలేను అంటూ రష్మిక ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇక ఆ ఇంటర్వ్యూలో రష్మిక రక్షిత్ శెట్టి రిషబ్ శెట్టి (Rishab Shetty) ల గురించి పాజిటివ్ గా మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ రిషబ్ శెట్టికి భయపడే ఇలా చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Click here for follow Pakkafilmy in google news