బేబి సినిమా చిన్న సినిమాగా విడుదలైంది. పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా పరిచయమైంది. పాత్రకు తగ్గట్టుగా బేబి పాత్రలో వైష్ణవి నటించడంతో మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా.. భారీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ కూడా అందుకుంటుంది. వైష్ణవిని సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా అభినందించారు. ఇప్పుడు వైష్ణవి.. ఎనర్జిటిక్ హీరో రామ్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏ సినిమాలో అంటే.. డబుల్ ఇస్మార్ట్ మూవీలో అని వార్తలు వస్తున్నాయి.

రామ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. అయితే.. ఇప్పటి వరకు ఇందులో హీరోయిన్స్ ఎవరు అనేది ప్రకటించలేదు. బేబి సినిమాతో సంచలనం సృష్టించిన వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారని తెలిసింది. ఇటీవల రామ్.. వైష్ణవి చైతన్యకు బోకే పంపించి అభినందించారు. ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది. ఇదంతా చూస్తుంటే.. డబుల్ ఇస్మార్ట్ మూవీలో వైష్ణవి చైతన్య నటించడం నిజమే అనిపిస్తుంది. మొత్తానికి బేబికి ఇది బంపర్ ఆఫరే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *