బేబి సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ సాధించాడు. 80 కోట్లు దాటిన ఈ చిత్రం 100 కోట్ల దిశగా దూసుకెళుతుంది. ఈ టీమ్ కి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పెషల్ గా పార్టీ ఇవ్వడం విశేషం. అయితే.. బేబి బ్లాక్ బస్టర్ సాధించడంతో ఆనంద్ దేవరకొండకు భారీ నిర్మాణ సంస్థల నుంచి భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆనంద్ దేవరకొండతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుందని తెలిసింది. రంగస్థలం, ఉప్పెన, పుష్ప, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించింది.

ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో ఓ భారీ చిత్రం నిర్మించాలని ప్లాన్ చేస్తుందట. అలాగే మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి మరియు తెలుగు, తమిళ్ లో భారీ చిత్రాలను నిర్మిస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ తో కలిసి ఆనంద్ దేవరకొండతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సంస్థలే కాకుండా మరి కొన్ని సంస్థల నుంచి భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే.. ఆనంద్ మాత్రం కథను బట్టి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. కథ నచ్చితో ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అంటున్నాడట. మరి.. ఆనంద్ కి నచ్చే కథను ఏ నిర్మాణ సంస్థ తీసుకువస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *