హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నారా లోకేష్ ను కలిసి పార్టీ కండువా కప్పుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అ‌వుతున్నాయి. అయితే దీనిపై నిఖిల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మేనమామ కొండయ్య యాదవ్ గుంటూరు జిల్లా చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందారు. ఆయనకు మద్ధతు తెలిపేందుకు నిఖిల్ లోకేష్ ను కలిసి థ్యాంక్స్ చెప్పారు. ఆ టైమ్ లో లోకేష్ పార్టీ కండువ నిఖిల్ కు కప్పారు.

దీంతో నిఖిల్ టీడీపీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం స్వయంభు అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా తర్వాత కార్తికేయ 3 కూడా అనౌన్స్ చేస్తారు. కార్తికేయ 3 చేయబోతున్నట్లు ఇటీవలే నిఖిల్ అఫీషియల్ గా వెల్లడించారు. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న నిఖిల్ ఇటీవలే తండ్రయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *