సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ చిత్రానికి ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ ముగ్గురుకి ఖుషి చాలా కీలకం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఖుషి చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఖుషి చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఖుషి మేకర్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్ సీస్ లో కూడా మంచి ఓపెనింగ్ రాబట్టింది.

ఈ సినిమా ఘన విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… ఈరోజు కోసం తనతో పాటు మీరంతా ఐదేళ్లు ఎదురు చూశారని చెప్పారు. తన కోసం ఎంతో సహనంతో వేచి చూశారని అన్నాడు. ఈ రోజు మనం సాధించామని చెప్పాడు. వందల ఫోన్లు, మెసేజులతో నిద్ర లేచానని… భావోద్వేగంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నాడు. మీ స్నేహితులు, కుటుంబంతో కలసి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయాలని చెప్పాడు. విజయ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *