రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ రామాయణం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ మాటలు రాయబోతున్నారట. పురాణాల గురించి అవగాహన ఉన్న త్రివిక్రమ్ అయితే ఈ సినిమా డైలాగ్స్ బాగుంటాయని మూవీ టీమ్ భావిస్తోంది. దర్శకుడిగా మారిన తర్వాత బయటి సినిమాలకు మాటలు రాయలేదు త్రివిక్రమ్. తన సొంత సినిమాలు అనుకున్న భీమ్లా నాయక్, బ్రో వంటి వాటికి మాత్రమే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. ఈ బాలీవుడ్ మూవీకి త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తే అది ఖచ్చితంగా సినిమాకు ఆకర్షణే అవుతుంది.

రామాయణం సినిమాను దర్శకుడు నితేశ్ తివారీ రూపొందించనున్నారు. త్వరలోనే అఫీషియల్ గా ఈ సినిమాను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. రావణుడిగా మరో స్టార్ నటిస్తారని అంటున్నారు. వీటిపై మూవీ టీమ్ అనౌన్స్ మెంట్ చేయాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *