తెలుగు దర్శకులపై ఆసక్తి చూపిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమాలో నటించిన ధనుష్..ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో సార్ బైలింగ్వల్ ఫిల్మ్ కాగా..కుబేర పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ క్రమంలో ధనుష్ మరో తెలుగు దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

శర్వానంద్ హీరోగా శ్రీకారం సినిమాను రూపొందించిన దర్శకుడు కిషోర్ ధనుష్ కు ఓ కథ చెప్పారని, అది ఆయనకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ లోని ఓ బిగ్ బ్యానర్ నిర్మించనుంది. ఉమ్మడి వ్యవసాయం నేపథ్యంలో శ్రీకారం సినిమాను రూపొందించారు డైరెక్టర్ కిషోర్. ఈ సినిమా కమర్షయిల్ గా వర్కవుట్ కాలేదు గానీ ఓ మంచి పాయింట్ ను డిస్కస్ చేసిన సినిమాగా పేరు తెచ్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed