స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ శిఖర్ పహానియాతో డేటింగ్ చేస్తోంది. చాలాకాలంగా వీరు ప్రేమలో ఉన్నారు. కలిసి బయట ప్రైవేట్ పార్టీల్లో కనిపిస్తుంటారు. జాన్వీ, శిఖర్ లవ్ గురించి బాలీవుడ్ మీడియాలో తరుచూ స్టోరీస్ వస్తుంటాయి. వీరి లవ్ సీరియస్ గానే ఉందని, రిలేషన్ కొనసాగిస్తారని తెలుస్తోంది. జాన్వీ కపూర్, శిఖర్ పహానియా ప్రేమ కథ గురించి ఈ స్టార్ హీరోయిన్ ఫాదర్ బోనీ కపూర్ కూడా పాజిటివ్ గానే స్పందించాడు. అతను తమ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి అని, మాతో కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాడని, అలాంటి అబ్బాయికి తన బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పాడు.
దీంతో జాన్వీ లవ్ కు బోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనుకోవచ్చు. వీరి పెళ్లి కి కూడా తమకేం అభ్యంతరం లేదని చెప్పేశాడు. అయితే జాన్వీ ప్రస్తుతం తన కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉంది. బాలీవుడ్ తో పాటు తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. రామ్ చరణ్ సరసన ఆర్ సీ 16 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఇటీవలే లాంఛ్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్ సరసన జాన్వీ నటిస్తున్న దేవర రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. జాన్వీ తెలుగులో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఆమె పెళ్లి గురించి ఆలోచించకపోవచ్చు.