స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. రెండేళ్లుగా ఆమె తెలుగు సినిమా కమిట్ కాలేదు. ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ లో పూజా హెగ్డే క్రేజ్ తగ్గిపోయింది. గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ తెలుగు వైపు చూడలేదు పూజా. కానీ రెండేళ్ల తర్వాత మళ్లీ ఆమెకు తెలుగు సినిమాలో నటించే అవకాశం తలుపు తట్టింది. నాగ చైతన్య హీరోగా నటించే కొత్త సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేకు అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తోంది.
పూజా హెగ్డే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు ఈ కాంబోలోనే చైతన్య సినిమా రాబోతోంది. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండూ నాగ చైతన్యతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకోవాలని అనుకుంటున్నారట. దీంతో పూజా టాలీవుడ్ రీఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లే. హిందీలో ఒకట్రెండు మూవీస్ చేస్తోంది పూజా హెగ్డే.