నాగ చైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్ షూటింగ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మాణంలో దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తండేల్ సినిమా ఆన్ లొకేషన్ నుంచి స్టిల్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫొటోస్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, చందూ మొండేటి, బన్నీ వాస్, అల్లు అరవింద్ ఉన్నారు. షూటింగ్ హెక్టిగ్ గా ఉన్నా..సరదాగా టీమ్ ఉన్నట్లు ఈ ఫొటోస్ తో తెలుస్తోంది.

పాకిస్థాన్ లో చిక్కుకున్న భారతీయ జాలర్లను వారిలో ఒక జాలరి నాయకుడిగా మారి ఎలా బయటకు తీసుకొచ్చాడు అనేది ఈ సినిమా నేపథ్యంగా ఉండబోతోంది. వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ దేవరకు పోటీగా అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. తండేల్, దేవర ఒకే నేపథ్యమున్న సినిమాలు, పైగా ఒకే టైమ్ లో రిలీజ్ కు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *