ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కుటుంబంతో పాటు జపాన్ లో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా అక్కడి వారి కోరిక మేరకు జపాన్ కు కుటుంబంతో సహా వెళ్లారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ ను సందర్శిస్తూ అక్కడి ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంతలో వారికి అనుకోని ప్రమాదం ఎదురైంది. ఎస్ఎస్ కార్తికేయ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

జపాన్ వెళ్లిన రాజమౌళి కుటుంబం ఓ హోటల్లో 28వ అంతస్తులో ఉంటోంది. సడెన్ గా వారు ఉంటున్న ఫ్లోర్ కదలడం మొదలైంది. స్మార్ట్ వాచ్ లో భూకంపం వస్తున్నట్లు జపాన్ వాతావరణ శాఖ మెసేజ్ డిస్ ప్లే అయ్యింది. దీంతో భయపడినట్లు కార్తికేయ తన ట్వీట్ లో తెలిపాడు. అయితే తమకేమీ కాలేదని, సురక్షితంగా ఉన్నట్లు తెలిపాడు. భూకంపం విపత్తును ఫస్ట్ టీమ్ దగ్గరగా చూసిన ఫీల్ కలిగిందని పోస్ట్ లో పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed