చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ధృవ నక్షత్రం సినిమాను వీలైనంత త్వరగా థియేటర్స్ లోకి తీసుకొస్తామని అంటున్నారు దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సినిమా రిలీజ్ ఆగిపోవడం వల్ల మూవీ లవర్స్, విక్రమ్ ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో తను ఊహించగలనని గౌతమ్ మీనన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ధృవ నక్షత్రం సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన చెప్పారు.
విక్రమ్, రితూ వర్మ ప్రధాన పాత్రల్లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ధృవ నక్షత్రం సినిమాను రూపొందించారు గౌతమ్ మీనన్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. జాన్ తన బేస్ మెంట్ అనే స్పై టీమ్ తో కలిసి చేసే సాహసాలు ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా..అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.