ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మార్చి నుంచి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి..ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ ఇవ్వబోతున్నారట ఎన్టీఆర్. ఇక ప్రశాంత్ నీల్ కూడా సలార్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసుకుంటారు. దాంతో పాటే సలార్ సెకండ్ పార్ట్ వర్క్ కూడా ఫినిష్ చేస్తారట.

ఎందుకంటే సలార్ ఫస్ట్ పార్ట్ తో పాటే చాలా వరకు సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా చేశారు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు ఫిబ్రవరి చివరకు పూర్తయినా మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎంతో స్పెషల్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *