పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి 21 ఏళ్లవుతోంది. ఆయన హీరోగా అరంగేట్రం చేసిన ఫస్ట్ మూవీ ఈశ్వర్ విడుదలై 21 ఏళ్లవుతోంది. ఈ సందర్భాన్ని అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ కు విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీన్ని అభిమానులు రీ పోస్టులు చేస్తున్నారు.
21 ఏళ్లలో ప్రభాస్ స్టార్ గా పాన్ ఇండియా స్థాయి గుర్తింపు పొందారు. ఈశ్వర్ నుంచి మొదలైన ప్రభాస్ సక్సెస్ జర్నీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పుడు ప్రభాస్ నటించిన సలార్ పై అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. సలార్ ప్రభాస్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ కానుంది.