సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు మారుపేరు మంచు విష్ణు. ఆయన ఏ పోస్టు చేసినా కామెంట్స్ విపరీతమైన ట్రోల్స్ తో వస్తుంటాయి. మంచు విష్ణు ఇటీవల కన్నప్ప సినిమాను అనౌన్స్ చేశాడు. ఇందులో హీరోయిన్ కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. షూటింగ్ స్టార్ట్ కాకముందే ఆమె ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయింది. స్టార్ హీరో ప్రభాస్ కన్నప్పలో కీ రోల్ చేస్తున్నారని ప్రకటించాడు మంచు విష్ణు. లొకేషన్ సెర్చ్ కోసం న్యూజీలాండ్ వెళ్లాడు.

ఇప్పుడు మలయాళ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించాడు. ఓ ప్రధాన పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నాడని అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా మూవీగా కన్నప్పను నిర్మించాలని మంచు విష్ణు ప్రయత్నం. అందులో భాగంగానే తనకు రీచ్ కాగలిగిన పెద్ద ఆర్టిస్టులను ఈ సినిమాలో అతిథి పాత్రల కోసం అడుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే సోషల్ మీడియాలో, బయట ఇండస్ట్రీలో ఎవరేం అనుకున్నా మంచు విష్ణు ఈసారి గట్టి ప్లాన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *