మోహన్ లాల్ హీరోగా నటించిన లూసీఫర్ సినిమాను ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు చాలామంది చూశారు. ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. అప్పుడు ఇంకా ఎక్కువ మంది లూసీఫర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఈ సినిమా చూశారు. ఇప్పుడు లూసీఫర్ సీక్వెల్ ఎంపూరాన్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన లాంఛ్ వీడియోలోని మేకింగ్ గ్రాండియర్ చూస్తే కేజీఎఫ్ మూవీ గుర్తొచ్చింది. రాజకీయ చదరంగంలో ఎన్నో కీలక పాత్రలు, వాటి మధ్య సంఘర్షణను ఈ వీడియోలో చూపించారు.

మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, మంజు వారియర్, శరద్ కేడ్కర్ వంటి వారంతా కీలక పాత్రలు పోషించారు. ఖురేషి అబ్ రామ్ క్యారెక్టర్ లో మోహన్ లాల్ మరోసారి కనిపించబోతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *