సల్మాన్ ఖాన్ కొత్త సినిమా టైగర్ 3 టీజర్ వచ్చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ తో టీజర్ ఆకట్టుకుంది. ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ తమ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మించింది. కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటించగా…మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. టీజర్ ఎలా ఉందో చూద్దాం.

20 ఏళ్లుగా భారత్ కోసం టైగర్ గూఢచారిగా పనిచేస్తున్నాడు. ప్రాణాలు లెక్కచేయకుండా ఎన్నో డేంజరస్ మిషన్స్ లో పాల్గొన్నాడు. అలాంటి టైగర్ దేశానికి శత్రువుగా ఎందుకు మారాడు, భారత్ కు ద్రోహం చేయాలని అనుకున్నాడా అనే అంశాలు టీజర్ లో ఆసక్తి కలిగించాయి. 20 ఏళ్ల సేవకు దేశాన్ని నేను ఏమీ అడగలేదు. ఇప్పుడు అడగాలని అనుకుంటున్నా, నేనెవరో నా కొడుక్కు చెప్పను, కానీ నేను దేశభక్తుడినా, దేశ ద్రోహినా అనేది మీరు నా కొడుక్కి చెప్పండి, టైగర్ బతికి ఉన్నంతవరకు ఓడిపోడు అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమాలో హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ కాబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

టైగర్ సిరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సక్సెస్ కాగా..ఇప్పుడు టైగర్ 3 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ దీపావళికి టైగర్ 3 రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *