టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత వెంటనే కొత్త సినిమాని ప్రకటిస్తాను అన్నారు. సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది వెళ్లిపోయింది.. శ్రీరామనవి కూడా వెళ్లిపోయింది.. కానీ ఇప్పటి వరకు నాగ్ మూవీ అనౌన్స్ చేయలేదు. గత కొన్ని రోజులుగా నాగార్జున రైటర్ బెజవాడ ప్రసన్నను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాలి అనుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇప్పటి వరకు నాగ్ మూవీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.

ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే… ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను ప్రసన్నకు కాకుండా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ కు అప్పగించారని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ నెలలోనే ఈ సినిమాను ప్రకటించనున్నారు. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన నాగ్ బంగార్రాజు సినిమాతో మాత్రం ఆకట్టుకున్నాడు. అందుచేత ఇప్పుడు ప్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా కథను రెడీ చేశారని తెలిసింది. మరి.. ఈ సినిమాతో కింగ్ బ్లాక్ బస్టర్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *