SamanthaSamantha.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాదు అక్కినేని కోడలుగా కూడా మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది సమంత.(Samantha). అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత భారీ స్థాయిలో ట్రోల్ కి గురైన ఈమె ఆ తర్వాత మయో సిటీస్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే తన అనారోగ్య సమస్య నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యశోద సినిమాతో బంపర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది.

ఇదిలా వుండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత ఉంగరాలను సెంటిమెంటుగా భావించి ధరిస్తోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయ. అసలు విషయంలోకి వెళితే యశోద సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు తన చేతికి ఉన్న మూడు రంగురాళ్లను పసిగట్టారు. దీంతో ఆమె ఉంగరాల వైపు కూడా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు క్లిక్ మనిపించిన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు తెలిసిన కొన్ని విషయాల ప్రకారం కచ్చితంగా ఆమె సెంటిమెంట్ ను ఫాలో అవుతుందని.. ఇకపై ఆమె రంగురాళ్లను ధరించబోతుందని సమాచారం.

అయితే ఇప్పటివరకు ఆమె ధరించిన రాళ్లు డిజైనర్ ఉంగరాలు కావని.. హిందూ సంస్కృతిక ప్రకారం అవి కొన్ని జాతకాల ప్రకారం అదృష్టాన్ని తీసుకొరావడానికి వాటిని ధరించినట్లు తెలుస్తోంది.అయితే ఆమె ధరించిన ఉంగరాలలో ఒకటి కనకపుష్యరాగం అనే ఉంగరం ఉంది. ఈ ఉంగరం సంపద , ఆరోగ్యం , కీర్తి , ఫలవంతమైన సంబంధాలను ఇస్తుందని కూడా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆమె ధరించిన గోమేధకం రాయి ఉంగరం కూడా చెడు దృష్టి నుంచి కాపాడుతుందట.

రాహు గ్రహం యొక్క చెడు ప్రభావం ఉన్నవారు ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల వారికి మానసికంగా శారీరకంగా మనశ్శాంతిగా ఉంటుందని సమాచారం. మరొకవైపు ఆమె ధరించిన ముత్యం ఉంగరం వెనుక చంద్రుడు ఒక క్షణంలో బలహీనంగా మారాడని దీంతో ఆ ప్రభావం తన ఆరోగ్యం పై పడకుండా ఈ ఉంగరాలను ధరించిందని తెలుస్తోంది. మొత్తానికైతే సమంత కూడా సెంటిమెంట్ చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed