టాలీవుడ్ యంగ్ అండ మోస్ట్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని గత కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ఆమె తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అవుతుంది.
భారీ బ్యాక్గ్రైండ్ ఉన్న రక్షిత రెడ్డి(rakshita reddy) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. ఇకపోతే రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఈనెల 26న హైదరాబాద్లోనే జరగనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలే ఇప్పుడు నిజం అయ్యాయి. అవును, నేడు శర్వానంద్, రక్షిత రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ఇరు కుటుంబసభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితుల నడుమ రక్షితకు శర్వా రింగ్ తొడిగాడు. అయితే వీరి నిశ్చితార్థం వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన(upasana) సైతం హాజరు అయ్యి సందడి చేశారు. శర్వా, రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్స్. మరియు క్లాస్మేట్స్ కూడా. బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రామ్ చరణ్, శర్వానంద్ కలిసి చదువుకున్నారు.
ఆ కారణంగానే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. మెగా ఫ్యామిలీతోనూ శర్వాకు మంచి సన్నిహిత్యం ఉంది. ఆ సన్నిహిత్యం నేపథ్యంలో శర్వా ఎంగేజ్మెంట్ లో రామ్ చరణ్(Ram Charan) సతీసమేతంగా వెళ్లి కాబోయే దంపతులకు బెస్ట్ విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ దంపతులతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సైతం శర్వా నిశ్చితార్థానికి హాజరు అయినట్లు తెలుస్తోంది. కాగా, శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం సమ్మర్ లో ఉండొచ్చని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Two souls, one heart ❤️
Charming Hero @ImSharwanand gets engaged to Rakshita ✨ Best Wishes to the couple on their special day 🤗#Sharwanand #Rakshita pic.twitter.com/ESsQvD3aG8
— PakkaFilmy (@pakkafilmy007) January 26, 2023