Raveena Tandon.. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సెలబ్రిటీలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కీరవాణితోపాటు పలువురు నటీనటులకు సింగర్లకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. అలాంటి వారిలో తాజాగా బాలయ్య హీరోయిన్ రవీనాటాండన్ ను కూడా పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గత ఏడాది కేజీఎఫ్ 2 సినిమాలో ప్రధానమంత్రి రవికాసేన్ పాత్రలో నార్త్ సౌత్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా ఈ అవార్డు లభించడం ప్రశంసనీయం.
రవీనా టాండన్ ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బడా డైరెక్టర్ రవి టాండన్ కూతురు.. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రాకముందు ముంబైలో మోడలింగ్ చేసిన ఈమె ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన పత్తర్ కే పూల్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న రవీనా (Raveena Tandon) ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.. ముఖ్యంగా తూ చీజ్ బడి హై మస్త్ మస్త్ అంటూ మొహ్రా సినిమాలో ఈమె చేసిన నృత్యం ఎప్పటికీ ఎవర్గ్రీన్ నడుము వయ్యారాలతో యువతను ఆకట్టుకుంది.
1994లో అజయ్ దేవగన్ , సునీల్ శెట్టి హీరోలుగా వచ్చిన దిల్వాలే సినిమాతో పాటు అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి మొహ్రా సినిమాలో సక్సెస్ అవడంతో ఈమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ లభించింది. కేవలం బాలీవుడ్ సినీ ప్రేక్షకులనే కాదు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ హీరోలుగా వచ్చిన రథసారధి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె నందమూరి బాలకృష్ణ హీరోగా, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన బంగారు బుల్లోడు సినిమాలో కూడా నటించింది.
నాగార్జున సరసన ఆకాశవీధిలో.. మోహన్ బాబు సరసన పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. మొత్తానికైతే ఈరోజు ఈమె పద్మశ్రీ పురస్కారం అందుకోవడంతో పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు.