VarasuduVarasudu: ప్రముఖ కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో విజయ్ (Vijay)నటించిన తాజా చిత్రం వారిసు. తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. జనవరి 11వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తమిళ్లో విడుదల చేయగా యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా కలెక్షన్లను వసూలు చేస్తూ విజయ్ సత్తా చూపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరోయిన్ మిస్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి వారిసు సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్, రష్మిక మందన్న, ఖుష్బూ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో వారిసు సినిమాలో ఖుష్బూ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తీరా సినిమా చూసిన తర్వాత ఖుష్బూ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమిళ్ మీడియా సర్కిల్స్ లో ఖుష్బూను నటింపజేసిన పాత్రను ఆ తర్వాత జయసుధ తో రీప్లేస్ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా తమిళ్ తంబీలకు ఖుష్బూ అంటే విపరీతమైన అభిమానం. అందుకే ఆమె కోసం గుడి కూడా కట్టించారు . అలాంటి ఈమె కోసం సినిమాకి వచ్చిన చాలామంది అభిమానులకు నిరాశ మిగిలిందని చెప్పాలి.

ఇకపోతే ఖుష్బూ (Khushboo) పాత్రను జయసుధ (Jayasudha)తో రీప్లేస్ చేసినట్లుగా యూనిట్ వర్గాల నుండి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి కుటుంబ పెద్ద పాత్రలో ఖుష్బూ కంటే జయసుధ అయితేనే బాగుంటుందని.. ఒకవేళ ఖుష్బూ ఉండి ఉంటే కచ్చితంగా ఆ పాత్ర నిరాశపరిచేదేమో అంటూ కూడా మరి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికైతే ఖుష్బూ ఈ సినిమా షూటింగ్ సమయంలో సందడి చేసి.. ఇప్పుడు లేకపోవడం ఒకింత చర్చకు తెర తీసినట్లు అయ్యింది .తమిళ సినీ ప్రేక్షకులు ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగా చర్చించుకుంటున్నారు. ఇకపోతే వారిసు సినిమాను తెలుగులో వారసుడు పేరిట జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *