Nandamuri Mokshagna

Nandamuri Mokshagna: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో చాలామందిని అలరించింది. అయితే బాలకృష్ణ ఈ మధ్యకాలంలో ఆదిత్య 369 సీక్వెల్ గా 399 కచ్చితంగా తీస్తానని పలుమార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకి స్వయంగా తానే దర్శకత్వం వహించి తన కొడుకుని అందులో హీరోగా పెట్టి ఇండస్ట్రీకి తన కొడుకుని పరిచయం చేస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

ఇక ఓవైపు తండ్రి నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో మోక్షాజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని నందమూరి అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటికి కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ పూర్తయి సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తానని ఒప్పుకున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఈ నేపద్యంలోనే తాజాగా బాలకృష్ణ ఆదిత్య 399 సినిమా మీద ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే..బాలకృష్ణ (Balakrishna) తన దర్శకత్వంలో తీయబోయే ఆదిత్య 399 సినిమా ని ఫిబ్రవరిలో పట్టాలెక్కించనున్నట్లు ప్రస్తుతం ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పట్టాలెక్కించడానికి బాలకృష్ణ సిద్ధమైనట్లు ప్రస్తుతం కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా విషయాన్ని బాలకృష్ణ అఫీషియల్ గా ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

కానీ ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇవ్వాలని చాలామంది భావిస్తున్నారు. అయితే మరి కొంతమందేమో ఇంకా వీర సింహారెడ్డి సినిమా రిలీజే కాలేదు.అప్పుడే ఆదిత్య 399 సినిమా తీయబోతున్నారు అంటున్నారు.అసలు ఇందులో నిజం ఎంతుందో తెలియదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ ఆదిత్య 399 (Adithya 399) సినిమాని ఫిబ్రవరిలో తెరకెక్కిస్తారా లేదా తన సినిమా కోసం ఇంకొన్ని రోజులు ఆదిత్య 399 సినిమాని పక్కన పెడతారా అనేది వేచి చూడాలి.

Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *