సినిమాలలో క్యారెక్టర్ ను బట్టి.. ప్రాముఖ్యతను బట్టి పారితోషకం మారుతూ ఉంటుంది. సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే హీరో క్యారెక్టర్ కి ఎక్కువ పారిపోషకం ఇస్తూ ఉంటారు.. కానీ ఒక హీరో క్యారెక్టర్ హైలెట్ అవ్వాలి అంటే విలన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. అప్పుడే విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత హీరోయిజం ప్రదర్శించవచ్చు. ఈ క్రమంలోనే హీరో అంత క్రేజ్ విలన్లకు కూడా ఉండడంతో వాళ్ళు తీసుకునే పారితోషకములు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. ఇకపోతే ఇటీవల కాలంలో కొంతమంది చిన్న హీరోల కంటే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న విలన్లు కూడా లేకపోలేదు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
జగపతిబాబు:
లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయమైన జగపతిబాబు.. ప్రస్తుతం విలన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. ఆయన ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. కుర్ర హీరోలతో పోల్చి చూస్తే ఈ పారితోషికం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.
శ్రీకాంత్:
రీసెంట్గా విలన్ గా పరిచయమైన హీరో శ్రీకాంత్ ఒకప్పుడు హీరోగా నటించిన ఈయన.. ఇప్పుడు విలన్ గా కూడా భారీగానే అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఖండ సినిమాకు కోటి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.
ప్రకాష్ రాజ్:
విలన్ గా టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా బిజీగా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్.. ఆయన ఒక్కో రోజు షూటింగ్ కి సుమారుగా రూ.20 లక్షల వరకు తీసుకుంటారు. కొన్ని సినిమాలకు ఏకంగా రూ.2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
సోనూసూద్:
సోనూసూద్ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ ఈయన చేసేవన్నీ విలన్ పాత్రలే .. సోనూ వీళ్ళందరి కంటే ప్రస్తుతం ఎక్కువగానే పారితోషికం అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారిపోషకం తీసుకుంటున్నారు.
కిచ్చా సుదీప్:
ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న విలన్స్ లో కన్నడ స్టార్ కిచ్ఛా సుదీప్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు.
ఆది పినిశెట్టి:
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా ప్రస్తుతం విలన్ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే సరైనోడు సినిమాకు ఆయన ఏకంగా రూ.కోటి 50 లక్షల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.