టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన సమంత నటించిన ‘యశోద’ సినిమా ఈ శుక్రవారం నుండి థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.ఐదు లాంగ్వేజ్లలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ మూవీ రిలీజైన మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకొని దూసుకు వెళ్తుంది.

ఈ మూవీ లో సమంతతో పాటు రావు రమేష్ వరలక్ష్మి శరత్ కుమార్, ముకుందన్,మొదలగు తారాగణం నటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే దాదాపుగా ఒక కోటి డెబ్భై లక్షలు రాబట్టిన ఈ ‘యశోద’ మూవీ యొక్క ఓటీటీ రైట్స్‌ని భారీ ధరకి ‘అమెజాన్ ప్రైమ్’ కైవసం చేసుకుంది. యశోద మూవీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఒకసారి చుస్తే మూవీ యూనిట్ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల గ్రాస్ వచ్చిందని సమాచారం.’ఓ బేబీ’ మూవీ తర్వాత సామ్ చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో మొదటి నుండి ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మూవీ మంచి విజయం తో దుస్కెలతుందికాక పొతే సామ్ పర్సనల్ విషయానికి వస్తే ఆమె గత కొన్నిరోజులుగా ‘మయోసైటిస్’ అనే తీవ్ర వ్యాధితో బాధపడుతుందని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా చెప్పడం విన్న అభిమానులుఈ విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒకపక్క చికిత్స తీసుకుంటూనే మరోపక్క షూటింగ్ లో పాల్గొనడం విశేషంగా చెప్పవచ్చు.ఐతే అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వడానికి కనీసం నెల రోజులు పడుతుందని సమాచారం. కొన్ని స్పెషల్ కేసెస్ లో మాత్రం సినిమా థియేటర్లలో ఇంకా స్పీడ్ మీద ఉంటే నిర్మాత యొక్క రిక్వెస్ట్ మేరకు ఇన్కొన్ని రోజులు లేట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఐతే నవంబరు రెండవ శుక్రవారం మూవీ రిలీజైన,డిసెంబరు రెండో వారంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంతే కానీ ఇప్పటికి కచ్చితంగా చెప్పలేము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *