యంగ్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన ప్రొడ్యూసర్ గా ఉంటూనే సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. ఇటీవల బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్, ఓం భీమ్ బుష్ సినిమాలను పంపిణీ చేయబోతున్నారు. ధీరజ్ మొగిలినేని తన డిస్ట్రిబ్యూషన్ ను సీడెడ్ కు విస్తరించారు.

సీడెడ్ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు. తాజాగా తిరుపతిలో సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ధీరజ్ మొగిలినేనికి ఇండస్ట్రీలోని వెల్ విషర్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. ధీరజ్ ప్రస్తుతం రశ్మిక మందన్న లీడ్ రోల్ లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *