బాహుబలి తో పాన్ ఇండియా హీరో ఐనా డార్లింగ్ ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం గురించి అందరికి విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఐతే ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ సినిమాలంటే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఈ ప్రాజెక్ట్ కే మూవీ మూడో ప్రపంచ యుద్ధం ప్రధానఅంశంగా చిత్రికరించబడుతుంది.ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ లో రెడీ అవుతున్న ఈ సినిమాకి ప్రభాస్ సరసన దీపికా పదుకొణె జంటగా చేస్తుండగా, బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ గారు ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనబడునున్నారని సమాచారం.
ఐతే ఈ మూవీ కు సంబంధించిన విషయం ఏదోకటి ప్రతిరోజూ వైరల్ అవుతూఉంటుంది.దీంట్లో భాగంగానే తాజాగా ఈ మూవీ కి సంబంధించినా మరోక న్యూస్ సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీలో దర్శకుడు రామ్గోపాల్ వర్మ గారు కూడా నటిస్తున్నట్లు విశ్వసనియా వర్గాల సమాచారం.ఈ మూవీ లో ఆర్జీవిని ఒక కీలకమైన పాత్ర కోసం అడగగా ఆయన దానికి ఒప్పుకున్నారంట. అతి త్వరలోనే ఆర్జీవి కి సంబంధించిన సీన్స్ తీస్తారని అంటున్నారు మేకర్స్. ఐతే దీనిపై ఒక ఆఫీషల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా రావాల్సి ఉంది.
కాంట్రావెర్సిలకు పేరుపొందిన ఆయన ఇపుడు ప్రభాస్ సరసన నటిస్తే ఏమౌతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారు.ఐతే డైరెక్టర్ నాగ అశ్విన్ మాత్రం రామ్గోపాల్ వర్మ ను ఎలా చూపిస్తాడు మరియు ఆయన క్యారెక్టర్ ఎలావుందిబోతుంది అనే దానిపై ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఉన్నారు. ఈ మూవీ మూడో ప్రపంచ యుద్ధం కాన్సెప్ట్ తో సూపర్ హీరో ఇతివృత్తం గా ఈ మూవీ నిర్మిస్తున్నట్లు వచ్చాయి. ఐతే దీన్ని 2024 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.ఏదైమైనా ఈ మూవీ తో ప్రభాస్ ఇంకోసారి బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుందాం.