ఇటీవల కాలంలో హీరోయిన్స్ కి అసలు విలువ లేకుండా పోతోంది.. హీరోయిన్స్ అందాలను ఆసరాగా తీసుకొని అవకాశాల పేరిట వారిని మోసం చేస్తూ మరింత ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నీతూ చంద్ర కూడా ఇలాంటి ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొంది. మొదటిసారి 2003లో విష్ణు సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమెకు బాగా అవకాశాలు రావడంతో సుమంత్ హీరోగా వచ్చిన గోదావరి సినిమాలో సుమంత్ కి మరదలు పాత్రలో రాజీ గా నటించి తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇక తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన సత్యమేవ జయతే అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. అక్కడినుంచి ఈమె మరెన్నో అవకాశాలను అందుకుంటుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ చివరిసారిగా మనం సినిమాలో మాత్రమే కనిపించడం విశేషం. ఇక తర్వాత బాలీవుడ్ కి వెళ్లిన నీతూ చంద్ర ఎలాంటి క్యారెక్టర్స్ అయినా పోషించడానికి కూడా ఎప్పుడు వెనకాడ లేదు. అయితే ఇప్పుడు మాత్రం తన దగ్గర ఎలాంటి సినిమా అవకాశాలు.. డబ్బు లేవని నీతూ చెబుతోంది.

అయితే ఇదే అదునుగా చూసుకున్న ఒక బిజినెస్ మాన్ తనకు భార్యగా ఉండాలని, అలా ఉంటే నెలవారి జీతం కింద రూ.25 లక్షలు ఇస్తానని చెప్పడం విశేషం. నేను గొప్ప గొప్ప నటులతో పనిచేశాను.. వారిలో 13 మంది నేషనల్ అవార్డు విన్నర్స్ కూడా ఉన్నారు. పెద్ద పెద్ద చిత్రాలలో నటించాను . అలాంటి నాకు ఇప్పుడు సినిమాలు లేవు.. కానీ ఒక వ్యాపారవేత్త శాలరీడ్ వైఫ్ గా ఉండమన్నాడు. తన భార్యగా ఉంటే రూ. 25 లక్షలు నెలకు ఇస్తానన్నాడు. నా నిస్సహాయత చూసి ఇలాంటి ఆఫర్స్ ఇవ్వడం నాకు చాలా బాధ కలిగించింది.

మంచి మంచి సినిమాలలో నటించిన కూడా నాకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది. ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ అయితే ఆడిషన్ సమయంలోనే ఒక గంటలోనే నన్ను వద్దని చెప్పాడు . నన్ను ఆడిషన్ చేసి మరి నా కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి నో చెబుతారా అంటూ ప్రశ్నించింది. ఏది ఏమైనా నీతూ చంద్ర తన కష్టాలను చెప్పుకొని బాధపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *