రజినీకాంత్ హీరో గా యువ దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే కాబోలు అయన కొన్ని సినిమాలలో అతిధి పాత్ర లో కనిపించే అవకాశాలు ప్రేక్షకులలో మిస్ అవుతున్నారు ప్రేక్షకులు. గతంలో ఎంత బిజీ గా ఉన్నా కూడా రజినీకాంత్ అతిధి పాత్రలు చేసేవాడు. అలా బాలీవుడ్ సినిమా పరిశ్రమ రా వన్ లో అయన ఆఖరిగా అతిధి పాత్ర లో నటించారు.

తాజాగా ఇన్ని రోజుల తర్వాత ఓ సినిమాలో అతిధి పాత్ర పోషించడానికి అంగీకరించారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకురాలిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అధర్వ మురళి ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమయింది. ఈ సినిమా లో గెస్ట్ రోల్ చేయాలన్న ప్రతిపాదన రాగ దానికి సూపర్ స్టార్ ఒకే అన్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed