ఓటీటీలో తన ఫస్ట్ వెబ్ సిరీస్ దూత చేశాడు నాగ చైతన్య. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కు సీక్వెల్ దూత 2 ఉంటుందని అది నిన్ననే అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది. నాగ చైతన్య కూడా ఓ పేపర్ చూస్తూ అందులో మార్చి 19 అనే డేట్ ను హింట్ ఇచ్చాడు. దీంతో దూత 2 అనౌన్స్ మెంట్ ఉంటుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే అలాంటి ప్రకటన ఏదీ నాగ చైతన్య నుంచి వెలువడలేదు.

ఇక దూత 2 వెబ్ సిరీస్ గురించి మర్చిపోవచ్చనే టాక్ మొదలైంది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ నితిన్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. మనం సక్సెస్ క్రెడిట్ తో నాగార్జునకు కూడా ఓ కథ చెప్పాడట. ఈ రెండు ప్రాజెక్ట్స్ మీద విక్రమ్ ఫోకస్ చేస్తున్నాడు. మరోవైపు నాగ చైతన్యకు తండేల్ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేతిలో ఉంది. ఇది పర్పెక్ట్ గా ఫినిష్ చేసే పని ఒత్తిడిలో నాగ చైతన్య ఉన్నాడు. ఈ కారణాలతో ఇప్పటికి దూత 2 సిరీస్ పక్కనపెట్టినట్లే తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed