నైజాం డిస్ట్రిబ్యూషన్ లో కొత్త చరిత్ర సృష్టించింది ప్రభాస్ నటించిన సలార్ సినిమా. ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్ ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ దక్కించుకుంది. ఈ విషయాన్ని సలార్ మూవీ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నైజాం ఏరియాలో ఇప్పటిదాకా ప్రతి పెద్ద సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా..ఈసారి మైత్రీ సంస్థ రంగంలోకి దిగింది. ఆ సంస్థకు సలార్ అతిపెద్ద డిస్ట్రిబ్యూట్ ఫిల్మ్ కానుంది.

ఈ సినిమా నైజాం హక్కుల కోసం మైత్రీ సంస్థ 90 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించింది. ఇప్పటిదాకా నైజాం ఏరియాలో ఒక సినిమా పంపిణీకి పెట్టిన పెద్ద మొత్తమిదే. ఇలా నైజాం డిస్ట్రిబ్యూషన్ లో సలార్ రికార్డ్ సృష్టించింది. సలార్ మీదున్న క్రేజ్ కు నైజాం రైట్స్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *