కోలీవుడ్ స్టార్ ధనుష్ ఓ వైపు తమిళ్ లో సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు. హాలీవుడ్ లో కూడా సినిమా చేశాడు. ఇటీవల టాలీవుడ్ లో సార్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో సక్సెస్ అయ్యింది. తాజాగా మరోసారి బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆనంద్‌ ఎల్.రాయ్ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా రూపొందిన బాలీవుడ్‌ చిత్రానికి తేరే ఇష్క్‌ మే అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ విషయాన్ని తెలియచేసేందుకు చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో గడ్డంతో మాస్‌ లుక్‌లో ధనుష్‌ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో ధనుష్ మూడు బాలీవుడ్ సినిమాలో చేయగా.. అందులో రెండు సినిమాలు ఆనంద్ ఎల్.రాజ్ దర్శకత్వం వహించినవే. 2013లో రాంజానా సినిమాతో బాలీవుడ్ లో ధనుష్ అరంగేట్రం చేశాడు. 2021లో ఆత్రంగీ రే చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు. మరి.. ఈ సినిమాతో బాలీవుడ్ లో మరో విజయం సాధిస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed