పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన అథ్యాత్మిక చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆతృత అందరిలో నెలకొంది. జూన్ 16న అనగా ఈ శుక్రవారం ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆదిపురుష్ మూవీకి టిక్కెట్లు రేట్లు పెంచుకునేలా జీవో ఇవ్వడం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం… ఈ నెల 14 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ లలో 50 రూపాయల టికెట్ హైక్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది మొదటి మూడు రోజులకు వర్తించనుంది. అంతే కాకుండా ఉదయం 4 గంటల నుండి షోస్ స్టార్ట్ కానున్నాయి. వీటితో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ప్రభాస్ ప్రభంజనం సృష్టించడం ఖాయం అని టాక్ వినిపిస్తుంది. మొదటి రోజు ఆదిపురుష్ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ పండితుల అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed