టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే వరుసగా సినిమాలు నిర్మిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. పేరులో ఫ్యాక్టరీ ఉన్నట్టుగా నిజంగా సినిమాలు వరుసగా ఈ సంస్థ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఓ వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో చిత్రాన్ని నిర్మిస్తూనే మరో వైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. ఈ రెండు భారీ చిత్రాలే కాకుండా ఓ డజనకు పైగా సినిమాలు నిర్మాణంలో ఉండడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆదిపురుష్ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకుంది. అది కూడా దాదాపు 185 కోట్లకు దక్కించుకోవడం విశేషం. ఇంత రేటు పెట్టి ఆదిపురుష్ రైట్స్ దక్కించుకుందా..? ఏంటా ధైర్యం..? అంటూ ఇండస్ట్ర్రీ జనాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే కాకుండా.. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించే స్పిరిట్ మూవీ నిర్మాణంలో కూడా భాగస్వామిగా చేరనుందని మరో వార్త బయటకు వచ్చింది. ఇలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ షాక్ ల మీద షాక్ ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed