Siddharth-Kiara

Siddharth-Kiara : బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ కియారా అద్వానీలు పెళ్లికి సిద్ధమయ్యారు. వీళ్ళిద్దరూ రాజస్థాన్లోని జైసల్మీర్లో సూర్యగడ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా ఓ పండుగల తమ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ జంట పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాదు ఇప్పటికే పెళ్లికి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా చాలా రొమాంటిక్గా తీసుకున్నారు. అయితే వీరి పెళ్లి 4,5,6 తేదీలలో మెహందీ, సంగీత్, పెళ్లి జరగనున్నాయి. అయితే సిద్ధార్థ్ కియారా (Siddharth-Kiara ) ఇద్దరు వారి పెళ్లికి చాలా కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు వీరు పెళ్లి చేసుకోబోయే సూర్యఘడ్ ప్యాలెస్ లో అత్యంత ధనవంతులు మాత్రమే అందులో చేసుకుంటారట. ఇక ఈమె తన పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొత్తం వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి అప్పజెప్పినట్లు సమాచారం. సిద్ధార్థ కియారా (Siddharth-Kiara ) ల పెళ్ళికి 150 మంది విఐపి లతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులతో పాటు టాలీవుడ్ నుండి మహేష్ బాబు, రామ్ చరణ్ లను కియారా తన పెళ్లికి ఆహ్వానించినట్టు సమాచారం. అంతేకాదు అతిధుల కోసం ఏకంగా అత్యంత ఖరీదైన వాహనాలైనా మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, జాగ్వార్ వంటివి రెడీ చేసిందట.

తమ పెళ్ళికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అలాగే వచ్చిన అతిథులకు విలాసవంతమైన బెడ్రూంలు కూడా ఏర్పాటు చేసిందట. సూర్యఘడ్ ప్యాలెస్ లో విశాలవంతమైన హోటల్ గదులు, కృత్రిమ సరస్సు, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, పూల తోటలు, రెస్టారెంట్లు, విల్లాలు కూడా ఉన్నాయట. అయితే ఈ ప్యాలెస్ లో పెళ్లిళ్లు చేసుకునే చాలామంది జంటలకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఒక రోజుకి దాదాపు1.20 కోట్ల ఖరీదు ఉంటుందని తెలుస్తోంది.

అంతేకాకుండా అక్టోబర్ నుంచి మార్చి వరకు అయితే ఆ ప్యాలెస్ ఒక్కరోజు ధర రెండు కోట్లట. ఈ లెక్కన సిద్ధార్థ్ కియారా (Siddharth-Kiara ) ఇద్దరు కలిసి తాము పెళ్లి చేసుకోబోయే సూర్యఘడ్ ప్యాలెస్ కి రోజుకు రెండు కోట్ల చొప్పున ఆరు కోట్లు పెట్టి తమ పెళ్లి చేసుకోబోయే ప్యాలెస్ ని బుక్ చేసుకున్నారు. ఇంకా ఇతర ఖర్చులు అన్నీ కలిపితే దాదాపు 10 కోట్ల వరకు అవుతుందట.ఈ లెక్కన చూసుకుంటే వీరి పెళ్లి అత్యంత ఖరీదైనదని చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed