సహజ నటి సాయి పల్లవి(Sai Pallavi) గత ఏడాది `విరాటపర్వం`, `గార్గి` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత సాయి పల్లవి నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ విషయంలో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పేసిందంటూ కూడా ప్రచారం జరిగింది. సాయి పల్లవి పెళ్లి పీటలెక్కబోతోందని.. అందుకే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని కొద్ది రోజులు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఆమె నటనకు పులిస్టాప్ పెట్టి తనకు నచ్చిన వైద్య వృత్తిలో కొనసాగాలని అనుకుంటుందని.. సొంతంగా హాస్పటల్(hospital) సైతం నిర్మిస్తోందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే ఈ పుకార్లకు సాయి పల్లవి చెక్ పెట్టింది. కేవలం మంచి పాత్రల కోసమే ఎదురు చూస్తున్నానని.. సినిమాలను వదల్లేదని స్పష్టం చేసింది. ఇకపోతే తాజాగా ఈ అమ్మడు జాక్పాట్ కొట్టేసింది.
ఏకంగా రూ. 100 కోట్ల ప్రాజెక్టులో నటించే అద్భుత అవకాశాన్ని తన సొంతం చేసుకుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవల తన మైల్ స్టోన్ మూవీని ప్రకటించాడు. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రాన్ని తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. `డి50`(D50) వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో ఎస్జె సూర్య మరియు విష్ణు విశాల్ కీలక పాత్రలు పోషించబోతున్నారని తెలుస్తోంది.
వంద కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ చిత్రంలో ధనుష్ కు జోడీగా సాయి పల్లవిని తీసుకున్నారట. తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో.. సాయి పల్లవి వెంటనే ధనుష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. కాగా, గతంలో సాయి పల్లవి, ధనుష్(Dhanush) కాంబోలో వచ్చిన `మారి 2` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలే అని అంటున్నారు.