అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న నట‌సింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) రీసెంట్గా `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక జనవరి 12న విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. టాక్ ఎలా ఉన్నా పండగ అడ్వాంటేజ్ తో భారీ వసూళ్లను రాబట్టి బాలయ్య ఖాతాలో మరో హిట్ పడేలా చేసింది.

ఇక ఈ మూవీ అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురిగా యంగ్‌ బ్యూటీ శ్రీలీల(Sreeleela) నటించ‌బోతుందని గతంలోని అనిల్ రావిపూడి వెల్లడించాడు.

సంక్రాంతికి ముందు సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే తాజాగా బాలయ్య ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించే అప్డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. నిన్న హైదరాబాదులో వీర సింహారెడ్డి విజయోత్సవ సభ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `బాలయ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం బాలయ్య సీజన్ నడుస్తోంది. ఎన్‌బీకే108(NBK108)లో ఈసారి అన్న తెలంగాణలో దిగుతుండు. ఇక బాక్సాఫీస్ వద్ద ఉచకోత మొదలవుతుంది. పవర్ ఫుల్ క్యారెక్టర్ తో రాబోతున్నారు` అని పేర్కొన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ సినిమాలు అందరూ చూశారు. కానీ, ఈసారి అనిల్ రావిపూడి బాల‌య్య సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణ యాసతో బాలయ్య విద్వంసం సృష్టించబోతున్నార‌ని తెలిపారు. దీంతో బాల‌య్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు, అనిల్ రావిపూడి కామెంట్స్ తో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *