బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో పాటు ప్రముఖ పాప్సింగర్ నిక్ జోనాస్ ను కూడా పట్టేసింది. తనకంటే పదేళ్లు చిన్నవాడు అయినప్పటికీ.. అతడితో ప్రేమలో పడి ఫైనల్ గా 2018లో పెళ్లి చేసేసుకుంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి గ్లోబల్ ఐకాన్ స్థాయి వరకు ఎదిగిన ప్రియాంక.. పెళ్లి తర్వాత కూడా తన ఫామ్ ను కోల్పోలేదు.
అటు హాలీవుడ్ తో పాటు ఇటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇకపోతే ప్రియాంకా చోప్రా- నిక్ జోనస్(Nick Jonas) ఇటీవల సరోగసి ద్వారా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక దంపతులు ఈ విషయంలో గత ఏడాది సోషల్ మీడియా ద్వారా స్వయంగా అనౌన్స్ చేశారు. అలాగే తమ ముద్దుల పాపకు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టారు.
అయితే ప్రియాంక చోప్రా సరోగసి(priyanka chopra surrogacy) పద్ధతిని ఎంచుకోవడం పట్ల కొన్ని విమర్శలు వచ్చాయి. ప్రెగ్నెంట్ అయితే ఎక్కడ అందం తగ్గిపోతుందో అన్న భయంతో ప్రియాంక సరోగసిని ఎంచుకుందంటూ కొందరు విమర్శించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సరోగసి ద్వారా ఎందుకు తల్లి అవ్వాల్సి వచ్చిందో ఆమె క్లారిటీ ఇచ్చింది. `నా కూతురు మాల్తీ డెలవరీ డేట్ కంటే ముందే జన్మించింది. తను పుట్టినప్పుడు నా చెయ్యి అంత సైజులో కూడా లేదు. అందువల్ల తనని కొన్ని రోజులు పాటు ఇంటెన్సివ్ కేర్ లో పెట్టవలసి వచ్చింది. ఆ టైమ్ లో నేను, నిక్ ఎంతో బాధపడ్డాం` అంటూ ప్రియాంక పేర్కొంది.
ఇక సరోగసిని(surrogacy) ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు.. ` అందం తగ్గుతుందని నేను సరోగసీకి వెళ్లినట్లు అందరు అనుకుంటున్నారు. కానీ, నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసి ద్వారా తల్లి అయ్యా. ఇక మా సరోగేట్ చాలా ఉదారంగా, దయతో, చాలా ఫన్నీగా ఉండేది. మాకు ఈ విలువైన బహుమతిని అందచేసింది` అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.