Jabardasth Ramu: బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్దస్త్ కామెడీ షోకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.అలాంటి జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమై మంచి మంచి సినిమాలు చేస్తూ కెరియర్ లో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుదీర్ (Sudigali Sudheer) , హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి ఎందరో కమెడియన్లు వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటు కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్లలో రాము కూడా ఒకరు.
ఈయన అదిరే అభి టీం లో కమెడియన్ గా కొనసాగుతూ కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాంటి జబర్దస్త్ కమెడియన్ రాము నాగార్జున వాళ్ళ కొన్ని డబ్బులు మోసపోయారట. ఇంతకీ ఆయన నాగార్జున వల్ల డబ్బులు మోసపోవడానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జబర్దస్త్ రాము (Jabardasth Ramu) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను డ్యాన్స్ బేబీ జూనియర్స్ లో చేశాను. అలాగే నేను ఓ రోజు అన్నపూర్ణ స్టూడియోలో కూర్చొని ఏడుస్తుంటే నా దగ్గరికి నాగార్జున వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ అని కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత నాకు సిగరెట్ కావాలని అన్నారు.
దాంతో నేను షాప్ కి వెళ్లి నా డబ్బులతో సిగరెట్ కొని తీసుకొచ్చి ఇచ్చాను. ఆ తర్వాత కూల్ డ్రింక్ కూడా తీసుకురమ్మన్నారు. కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాను. ఇక అదే టైంలో నాకు అసలు విషయం అర్థమైంది.అదేంటంటే అసలు నేను కూల్ డ్రింక్,సిగరెట్ ఇచ్చింది రియల్ నాగార్జున (Nagarjuna) కి కాదు. నాగార్జునకు డూప్ చేసే శివ అనే వ్యక్తికి. ఇలా నాగార్జున అనుకొని ఆయన డూప్ కి నేను సిగరెట్, కూల్ డ్రింక్ తీసుకువచ్చి డబ్బులు నష్టపోయాను.అంతే కాదు ఎప్పటికైనా ఈ విషయాన్ని నేను నాగార్జున దగ్గర చెప్పి నా డబ్బులు నాగార్జున దగ్గర కలెక్ట్ చేసుకుంటాను.
నాకు అప్పట్లోనే ఓ డైరెక్టర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ ఆ సినిమాలో క్యారెక్టర్ కావాలంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. కానీ ఆ టైం లో మూడు లక్షలేమో కానీ నా దగ్గర 3000 కూడా లేవు.అందుకే నేను ఆ సినిమాలో చేయలేనని చెప్పాను. అయితే ఆ డైరెక్టర్ పేరు ఏంటో ఇప్పుడు నేను చెప్పదలచుకోలేదు అంటూ జబర్దస్త్ రాము (Jabardasth Ramu) ఆ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి.
Click here for follow Pakkafilmy in google news