తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి గౌరవం ఉందో మనందరికీ తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు తన నటనతో అక్కినేని ఫ్యామిలీకి అంత గుర్తింపు తీసుకొచ్చి పెట్టారు. ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక నాగార్జున సినీ కెరియర్ పరంగా ఎంత సక్సెస్ అయినప్పటికీ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటారు.
నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. మొదట దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత సినిమాల్లో నటించే టైంలో అమల ప్రేమలో పడి లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక అమలను పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్లకి ఎవరికి ఇష్టం లేకపోయినప్పటికీ నాగార్జున వారి ఇష్టాన్ని పట్టించుకోకుండా ఆమెని పెళ్లి చేసుకున్నాడు.
కానీ పెళ్లి జరిగిన టైంలో నాగార్జునను చాలామంది తిట్టుకున్నారు. అయితే ఇప్పటికి కూడా నాగార్జున కేవలం అమలకు మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తూ ఆమె చెప్పిన బాటలోనే వెళుతూ ఉంటాడు.ఇక ఈ విషయం పక్కన పెడితే.. అమల హిందూ పండుగల్లో ఏ పండుగ అయినా చాలా ఇష్టంగా, సరదాగా చేసుకుంటుందట. కానీ ఒక్క కార్తీకమాస పండుగను మాత్రం అస్సలు జరుపుకోదట. కారణం ఏంటో తెలియదు కానీ అమలకు దీపాలు వెలిగించే సీజన్ అంటే అంతగా ఇష్టం ఉండదట.
అమలకు ఎక్కువగా క్యాండిల్స్ వెలిగించే అలవాటే ఉండడం వల్ల చేతితో దీపం పట్టుకోడానికి కూడా ఇష్టపడదట. ఇక ఈ విషయం ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమలకు దీపావళి పండుగ అంటే ఎందుకు నచ్చదు? కారణం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.