అవును..ఇప్పుడు శృతిహాసన్ కెరియర్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరోలతో శృతిహాసన్ నటించడం తో ఆమె కెరియర్ ఆగిపోతుందని నెటిజన్లు భావిస్తున్నారు. శృతిహాసన్ దాదాపు మూడు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది.

ఇక క్రాక్ సినిమా విషయంలో కేవలం శృతిహాసన్ కి మాత్రమే కాకుండా హీరో రవితేజ కి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి కూడా ప్లస్ అయింది. ఈ సినిమా కరోనా టైంలో విడుదలైనప్పటికీ మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. అంతేకాదు రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో ఈ సినిమాకి హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక శృతి హాసన్ రవితేజ కెరియర్ లు అయిపోయాయి అనుకునే టైంలో క్రాక్ సినిమాతో మళ్ళీ వీళ్లిద్దరి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి పడింది.

ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో కలిసి వీర సింహారెడ్డి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ నటించిన బోతోంది. అలాగే యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా చిరంజీవి సరసన హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తుంది. అయితే శృతిహాసన్ క్రాక్ లాంటి మంచి బ్లాక్ బస్టర్ సినిమా ని ఖాతాలో వేసుకున్నాక ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోలతో సినిమాలు చేస్తుంది అనుకున్నారు అందరూ.

కానీ ఎవరూ ఊహించని విధంగా శృతిహాసన్ సీనియర్ హీరోల సినిమాలకు ఓకే చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ విషయంలో శృతిహాసన్ కెరియర్ డేంజర్ లో పడింది అంటున్నారు నెటిజన్స్ . ఎందుకంటే సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి మళ్లీ యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకుండా పోతాయి కావచ్చని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *