ఇవాళ వెలువడిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని సోషలమీడియా ద్వారా కేటీఆర్‌ వెల్లడించారు.

ఈ ఉప ఎన్నికలలో ముందుగా తమ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గారి కి కేటీఆర్‌ అభినందనలు మరియు ప్రసంసశల వర్షం కురిపించారు.తమ పార్టీ ఐనా టీఆర్‌ఎస్‌పై, సీఏం కేసీఆర్‌ గారిపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలకి అన్ని తెల్సు వారికీ మంచి చేస్తున్నది ఎవరు? చెడు చేస్తుంది ఎవరు? అని. దాని పర్యావసనమే నేడు ప్రకటించిన ఫలితాలు దానికి నిదర్శనం.

ఇప్పటి నుండైనా తమ ప్రభుత్వం చేసే పనులను అడ్డుకోవడం ఆపి దయచేసి సహకరించమని ప్రతిపక్ష పార్టీ లను కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.కాగా, తాను చెప్పినట్లుగా, హామీ ప్రకారం మునుగోడును ఆయన దత్తత తీసుకుంటానని తెలిపారు. రానున్న రోజుల్లో పెండింగ్‌ అభివృద్ధి పనులను పూర్తి స్థాయి లో కంప్లీట్ చేస్తానని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *