అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్రీదేవి చలన చిత్ర పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. కేవలం అందం తో మాత్రమే కాకుండా అభినయంతో కూడా ఎంతోమంది అభిమానులను తన వశం చేసుకుంది.

ఐదు పదుల వయసులో కూడా స్టార్ హీరోయిన్లకు దీటుగా ఆమె అందం మెరిసిపోయేది అంటే ఆమె ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి అందాల తార అనుమానాస్పదంగా మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆమె సినిమాల్లో హీరోయిన్ గా స్టార్డం వచ్చాక ఎంతో కష్టపడి చెన్నైలో ఇష్టంగా ఓ ఇంటిని కొనుక్కుంది. ఇక ఆ ఇల్లు అంటే తనకు చాలా ఇష్టమని శ్రీదేవి ఎన్నో సార్లు చెప్పింది. అయితే తాజాగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ చెన్నైలోని తన తల్లి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇంటికి వెళ్లి అందులో హోమ్ టూర్ చేసింది.

ఇక ఆ హోమ్ టూర్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తన తల్లితో ఆ ఇంటికి ఉన్న అనుబంధాన్ని అలాగే తన తల్లిదండ్రులకు సంబంధించిన పెళ్లి ఫోటోలను అన్నింటిని చూపించింది. అయితే తన తల్లి పెళ్లి ఫోటోలను జాన్వి చూపిస్తూ వీళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అందుకే వీళ్ళ మొహాల్లో నవ్వు లేదు ఒత్తిడి మాత్రమే కనిపిస్తుంది అంటూ చెప్పింది. అలాగే జాన్వి కపూర్ తను ఉండే బెడ్ రూమ్ చూపిస్తూ నేను ఉండే బెడ్ రూమ్ లో నా బాత్రూం కి లాక్ ఉండదు. అయితే మా అమ్మ కావాలనే నా బాత్ రూమ్ కి గడియ పెట్టలేదు.

ఎందుకంటే ఒకవేళ నేను ఎక్కడ బాత్రూం కి వెళ్లి అబ్బాయిలతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతానేమోననే భయంతో కూడిన అనుమానంతో అలా నా బాత్ రూమ్ కి లాక్ పెట్టలేదు అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇంటికి ఎన్ని మరమ్మత్తులు చేయించినా సరే నా బాత్రూం కి మా అమ్మ గుర్తుగా ఇంకా లాక్ పెట్టించుకోలేదు అంటూ జాన్వి కపూర్ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వి కపూర్ మాట్లాడిన మాటలు, చేసిన హోమ్ టూర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *