తెరాస ఎమ్మెల్సి కవిత ఫైర్ అయ్యారు. భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ పై ధ్వజమెత్తారు. ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పుతో కొడతా అని ఆమె అన్నారు. తాను పార్టీ మారతాననే కూత కూస్తే బుద్ధి చెబుతానని ఆమె వెల్లడించారు.
నువ్వు ఎక్కడ పోటీ చేసినా వెంటపడి వెంటపడి ఓడిస్తా రాజకీయాలు చేయండి. దిగజారి ప్రవర్తించవద్దు అని అన్నారు. తను పార్టీ మారుతున్నాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె అన్నారు. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే సహించేదిలేడు అని అన్నారు.
గత కొన్ని రోజులుగా భాజపా తెలంగాణా లో బలపడుతుందన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ అరవింద్ కొన్ని వ్యాక్యాలు చేశారు. అయితే దానికి కవిత ఊహించని కామెంట్స్ చేయడం తెలంగాణా రాజకీయాలను వేడెక్చేకేలాసింది. మరి దీనిపై సిఎం కేసీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూద్దాం.
కవితను బీజేపీలో చేరాలని సంప్రదించారన్న అంశాన్ని ఇటీవల టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించారు. తాజాగా కవిత కూడా బీపీ ఆఫర్ నిజమే అని మదీయ ముందు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.