మెగాస్టార్ చిరంజీవి క్యాన్సర్ సెంటర్ ని స్టార్ట్ చేశారు. ఆయన నలభై ఏళ్ల వయసులో టెస్ట్ చేయించుకుని non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని చెప్పారు. తన అభిమానులకు, సినీ కార్మికుల కోసం క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు అభిమానులకు, సినీ కార్మికులకు ఉచితంగా టెస్ట్ చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఆ హాస్పటల్ ని కోరడం జరిగింది. ఇలా చేయడం కోసం తన వంతుగా ఎంత ఖర్చు అయినా భరిస్తాను అన్నారు.

అంతే.. చిరంజీవికి క్యాన్సర్.. ట్రీట్ మెంట్ చేయించుకుని బయటపడ్డారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చిరంజీవి దృష్టికి వెళ్లడంతో సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే… కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.

అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *