గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం అనే సినిమాలు చేయడం.. ఈ సినిమాలు సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఈ బ్యానర్ లో మూడవ సినిమా కూడా పరశురామ్ చేయాలి కాకపోతే మహేష్ బాబుతో సర్కారు వారి పాట చేసిన తర్వాత చేస్తాన్నాడు. అల్లు అరవింద్ ఓకే అన్నారు. అయితే.. గీత గోవిందం సీక్వెల్ గీతా ఆర్ట్స్ లో చేయాలి అనుకున్నారు అంతా ఓకే అయ్యింది అనుకుంటే.. పరశురామ్ వెళ్లి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. వెంటనే దిల్ రాజు ఈ సినిమాని ప్రకటించారు.

అంతే అల్లు అరవింద్ కు బాగా కోపం వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ.. పరశురామ్ ఇలా మాట మీద నిలబడకుండా తన బ్యానర్ లో చేస్తానని చెప్పి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడం గురించి బయటపెట్టాలి అనుకున్నారు కానీ.. చాలా మంది వద్దు అని చెప్పడంతో ఆగిపోయారు. ఇప్పుడు 2018 ధ్యాంక్స్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కొంత మంది తన వల్ల లాభం పొంది కూడా మాట మీద నిలబడకుండా గీత దాటి వెళ్లిపోయారు కానీ.. చందు మొండేటి అలా కాదు.. మాట మీద నిలబడి మా సంస్థలో సినిమా చేస్తున్నాడు అన్నారు. ఈ విధంగా పరశురామ్ పై తన కోపాన్ని మరోసారి బయటపెట్టారు అల్లు అరవింద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *