భారీ చిత్రాలను చేసే దర్శకుడైన గుణశేఖర్ ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ప్రముఖ సంస్కృత‌ నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏదైనా కూడా సమంత అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు.

తాజాగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేసినట్టు తెలిపారు. దానికి కారణం లేకపోలేదట. ఈ చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి గుణశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు గుణశేఖర్‌ తెలిపారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, సచిన్‌ ఖేడేకర్‌, కబీర్‌ బేడీ, ప్రకాష్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *