ధనుష్, నాగార్జున హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల పేర్ల మీద డీఎన్ఎస్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

ముంబై ధారావిలో ప్రాంతం నేపథ్యంలో సాగే మాఫియా కథతో ఈ సినిమా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సంస్థలో లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న చిత్రమిది. ధనుష్, నాగార్జున శేఖర్ కమ్ముల కాంబో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీగా హైప్ నెలకొని ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed