మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ కొద్ది రోజుల క్రితమే నెట్టింట వైరల్ కాగా..ఇప్పుడు అఫీషియల్ గా న్యూస్ వచ్చేసింది.

ఇళయరాజా బయోపిక్ లో ఇళయరాజా పాత్రలో ధనుష్ నటించబోతున్నారు. ఓ సాధారణ పేద దళిత కుటంబం నుంచి వచ్చిన ఇళయరాజా సంగీత దర్శకుడిగా సినీ రంగంలో ఎదిగిన స్ఫూర్తికర ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న ఈ సినిమాను ఆపై ఏడాది 2025లో సమ్మర్ లో రిలీజ్ చేస్తారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed