తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న వారందరూ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగబోతోంది. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) ఓ ఇంటివాడు అయ్యాడు. పూజా అనే అమ్మాయిలో వెంకీ ఏడడుగులు వేశాడు.
హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వెంకీ పెళ్లి వేడకలో నితిన్, ఆయన సతీమణి షాలినీ, కీర్తి సురేష్(keerthy suresh), డైరెక్టర్ వెంకీ కుడుముల తదితర సినీ తారలు సందడి చేశారు. నూతన దంపతులకు ఆశీర్వదించి బెస్ట్ విసెస్ తెలిపారు. ప్రస్తుతం వెంకీ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఎంకీ అట్లూరి.. నటుడిగా సినీ కెరీర్ ను ప్రారంభించాడు.
2007లో వచ్చిన జ్ఞాపకం సినిమాలో తొలిసారిగా నటించాడు. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. 2010లో వచ్చిన `స్నేహగీతం` సినిమాలో నటించడంతో పాటు సంభాషణలు రాశాడు. ఆ తర్వాత `కేరింత` సినిమాకు రచయితగా పని చేసిన వెంకీ.. 2018లో `తొలిప్రేమ`(tholi prema) మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ ధనుష్(dhanush) తో `సార్` అనే మూవీని తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.